Sunday, April 17, 2011

బ్రాహ్మణుల మధ్య కూడా ప్రాంతీయచిచ్చు పెట్టిన కెసీర్, ఇది నీకు సబబేనా?

మెజారిటీ రాజకీయ నాయకులకి రెండే లక్ష్యాలు, ఒకటి పవర్, రెండు ధనధాహం. వీటికోసం ప్రజలను కులాలుగా, మతాలుగా, భాష మీదో విడగొడతారు, మీరు రొటీన్ కి  కొంచెం భిన్నంగా ప్రాంతీయవాదం తో విడగొట్టారు.

అవునులే మాకే తెలివి ఉంటే మీరు చెప్పే సొల్లు వింటూ ఇలా ఎందుకుంటాం, ఇవే పోరాటాలు మీ అవినీతిమీద చేసేవాళ్ళం, మిమ్ములందరనీ ఏ అండమాను దీవులుకో పంపేవాళ్ళం. విడగొట్టటాలు, వినాసనాలు చేయటం చాలా తేలిక, కానీ నిర్మిచటం, కలపటం చాలా కష్టం.

ఏది ఏమయినా బ్రాహ్మణుల మధ్య కూడా ప్రాంతీయచిచ్చు పెట్టి ప్రాంతీయపిచ్చి ఉన్నవాళ్ళ దృష్టిలో ఒక మెట్టు ఎక్కినా, చరిత్ర నిన్ను క్షమించదు. బ్రహ్మణులు అయిపోయారు, ఇక దేవుళ్ళే మిగిలి వున్నారు. వారికి కూడా ఏదొక ప్రాంతం అంటగట్టి భక్తుల మధ్య కూడా చిచ్చుపెట్టేయ్, అప్పుడయినా నీ కడుపు నిండుతుందేమో.  మరి మీరేమంటారు? Say YES or NO.

Poll Results:

1 comment: